భారత్‌లో విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు

అపారమైన అవకాశాలుగల భారత దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ప్రవేశించింది. దేశియ ఫోన్ తయారీదారులయిన స్పైస్, మైక్రోమాక్స్ మరియు కార్బన్ లతో జట్టు కట్టి చవక (6500రూపాయలు) స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు విడుదలచేసింది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భారత్‌లోనే ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను
విడుదలచేయడం విశేషం. తాజా ఆండ్రాయిడ్ వెర్షనుతో (కిట్‌కాట్) వచ్చే ఈ ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షను విడుదలైన వెంటనే తొందరగా అప్‌డేట్లు రావడం, తయారీదారు అప్లికేషన్‌లు మరియు మార్పులు తక్కువగా ఉండి శుద్దమైన ఆండ్రాయిడ్ అనుభవం ఈ ఫోన్‌ల సొంతం. 
ఇంచుమించు ఒకే స్పెసిఫికేషన్‌లతో విడుదలైన ఈ మూడు ఫోన్‌లు 4.5 తాకేతెర, 1.3 GHz క్వాడ్రకోర్ ప్రాససర్, 1జిబి రామ్, 4జిబి స్టోరేజి, రెండు సిమ్‌లు, యస్‌డికార్డ్‌స్లాట్, ముందు 2 యంపి వెనుక 5 యంపి కెమేరాలు మరియు ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం కలిగిఉన్నాయి. ఈ ఫోన్‌లు కొన్న ఎయిర్ టెల్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్‌డేట్ ఉచితంగాను మరియు ప్లేస్టోర్ లో నెలకి 200 యంబి ఉచిత డౌన్‌లోడ్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్ల కొనుగోలుతో 8జిబి యస్‌డి కార్డ్ మరియు 200 రూపాయల టాక్‌టైం ఉచితంగా అందిస్తున్నారు.అన్‌లైన్‌లో అమ్మకాలకి ఉంచిన ఈ ఫోన్‌ల గురించి మరింత సమాచారం కోసం మరియు కొనుగోలుచేయడానికి ఇక్కడ చూడండి.