మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లు ఉచితం , ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ కి మా సాఫ్ట్వేర్లు ఉచితం - మైక్రోసాఫ్ట్

ఆంధ్రప్రదేశ్ దెబ్బకు మైక్రోసాఫ్ట్ దాసోహం

ఆంధ్రప్రదేశ్ సేవలను గుర్తించిన మైక్రోసాఫ్ట్

ఆంధ్రప్రదేశ్ సేవలకు మైక్రోసాఫ్ట్ ప్రతిఫలం

ఆంధ్రప్రదేశ్ ని ఆధర్శంగా తీసుకోవాలని ప్రపంచ దేశలకు మైక్రోసాఫ్ట్ హితవు

ఆంధ్రప్రదేశ్ ని బంగారు భాగస్వామి అవార్డుతో సత్కరించిన మైక్రోసాఫ్ట్

పైరేటెడ్ సాఫ్ట్వేర్ కి ఆంధ్రప్రదేశ్ సెలవు




 హైదరాబాద్, రెడ్ మండ్, రేపటి వార్త : ఆంధ్రప్రదేశ్ యొక్క సేవలను గుర్తించిన ప్రముఖ సాఫ్ట్వేర్ ధిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటి నుండి తన సంస్థ తయారు చేసే సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ కి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించినది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ని బంగారు భాగస్వామి అవార్డుతో సత్కరించినది. ఈ సంధర్బాన్ని పురశ్కరించుకొని నిన్న జరిగిన సమావేశంలో మైక్రోసాఫ్ట్ సంస్థ నేత ఈ విషయాన్ని ప్రకటించారు. చిత్త సుద్దితో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులను వాడినందుకు మరియు ప్రచారం కల్పించడంలోను రాష్త్రం యొక్క చొరవను పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ని ఆధర్శంగా తీసుకోవాలని ప్రపంచ దేశలకు మైక్రోసాఫ్ట్ హితవు పలికింది. మన తరుపున పలానా మాట్లాడుతు చిన్నప్పటి నుండి ప్రజలు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లు వాడే విధంగా పాఠశాల స్థాయి నుండి ఏవిధంగా ఏర్పాట్లు చేసారో వివరించారు.



కలలా ఉన్నా మన కృషికి ఇదే సరయిన ఫలితం. తొందరలో జరుగుతుందని ఒక చిన్న ఆశ.